వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొందరొద్దు... చర్చిస్తున్నాం: గంటాను వారించిన కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Ganta Srinivas Rao
హైదరాబాద్: రాజీనామాలు ఆమోదించుకునేందుకు సిద్ధపడిన మంత్రులు గంటా శ్రీనివాస రావు, కాసు వెంకట కృష్ణా రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డిలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం వారించినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం గంటా తదితరులు గవర్నర్ నరసింహన్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించుకునేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే.

వారు గవర్నర్‌ను కలిసే ముందు ముఖ్యమంత్రిని కలిశారు. తాము రాజీనామాలు ఆమోదింప చేసుకుంటామని చెప్పారు. అయితే, కిరణ్ వారిని వారించారట. ఏ నిర్ణయం తీసుకున్నా సమష్టిగా తీసుకుందామని, అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయని, తొందరపడవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది.

కిరణ్ వద్దే రాజీనామాలు: శత్రుచర్ల

తమ రాజీనామాలు ముఖ్యమంత్రి వద్దనే ఉన్నాయని మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్న తాము సమష్టిగా తీసుకుంటామని చెప్పారు.

హైకోర్టులో ఎపిఎన్జీవో సమ్మెపై వాదన

ఎపిఎన్జీవో సమ్మె పైన హైకోర్టులో సోమవారం వాదనలు ప్రారంభమయ్యాయి. సమ్మె పైన ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని, ఎలాంటి ఫలితం వచ్చిందని కోర్టు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. సమ్మె అంశంపై ఎస్మా, మంత్రుల కమిటీ వేశామని రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

సిఎస్, డిజిపిలు సమ్మెను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. గవర్నర్ నివేదిక కోరుతామని కేంద్రం కోర్టుకు తెలిపింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. టిఎన్జీవోల సమ్మె పైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ పైన తీసుకుంటున్నారని ఎపిఎన్జీవో న్యాయవాది చెప్పారు.

English summary
Ministers Ganta Srinivas Rao, Erasu Pratap Reddy and Kasu Venkata Krishna Reddy were met CM Kiran Kumar Reddy on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X