జగన్పార్టీ మరో పిఆర్పీ: జిట్టా, 'వైయస్ విగ్రహాలుండవు'
తీరా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలన్నారని, ఇదే డిమాండ్తో తల్లీ కొడుకులు దీక్షల డ్రామా ఆడారని, ఇప్పుడు సమైక్యవాదాన్ని ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు. సీమాంధ్రలో అధికారంలోకి రావటానికి ఓట్లు, సీట్ల కోసం పాకులాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలు, నాయకుల జీవితాలతో చెలగాటం ఆడిందని విమర్శించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టంగా సమైక్యవాద వైఖరి తీసుకున్నాక, తెలంగాణ ప్రాంతానికి చెందిన బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి వంటి నేతలు ఇంకా ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారో చెప్పాలన్నారు. జగన్ పార్టీ మరో ప్రజారాజ్యంగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణలోని ఆ పార్టీ నేతలు బయటకు రావాలన్నారు. జగన్ పైన కేసులు మాఫీ చేస్తామని కాంగ్రెసు చెబితే సీమాంధ్ర ప్రజలనూ మోసంచేయడానికి సిద్ధమవుతుందని విమర్శించారు.
వైయస్ విగ్రహాలుండవు: టి బిసి ఫోరం
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర పేరుతో చేపట్టే యాత్ర మానుకోవాలని తెలంగాణ బిసి ఫోరం హెచ్చరించింది. తెలంగాణ ప్రజలను మోసం చేస్తే ఈ ప్రాంతంలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉండవన్నారు.