వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పార్టీ మరో పిఆర్పీ: జిట్టా, 'వైయస్ విగ్రహాలుండవు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విలువలు, విశ్వసనీయతలేని పార్టీ అని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ లేఖతో రుజువైందని, ఆ పార్టీ మరో ప్రజారాజ్యమని తెలంగాణ ప్రాంత నేత జిట్టా బాలకృష్ణా రెడ్డి ఆదివారం మండిపడ్డారు. ప్రపంచంలో విశ్వసనీయతలేని పార్టీ ఏదైనా ఉందంటే అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తప్ప మరొకటి కాదన్నారు. తమకు తెలంగాణ ఇచ్చే శక్తి లేదని, తెచ్చే శక్తి లేదని, దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని మొదట చెప్పారని గుర్తు చేశారు.

తీరా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయాలన్నారని, ఇదే డిమాండ్‌తో తల్లీ కొడుకులు దీక్షల డ్రామా ఆడారని, ఇప్పుడు సమైక్యవాదాన్ని ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు. సీమాంధ్రలో అధికారంలోకి రావటానికి ఓట్లు, సీట్ల కోసం పాకులాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రజలు, నాయకుల జీవితాలతో చెలగాటం ఆడిందని విమర్శించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పష్టంగా సమైక్యవాద వైఖరి తీసుకున్నాక, తెలంగాణ ప్రాంతానికి చెందిన బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి వంటి నేతలు ఇంకా ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారో చెప్పాలన్నారు. జగన్ పార్టీ మరో ప్రజారాజ్యంగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణలోని ఆ పార్టీ నేతలు బయటకు రావాలన్నారు. జగన్ పైన కేసులు మాఫీ చేస్తామని కాంగ్రెసు చెబితే సీమాంధ్ర ప్రజలనూ మోసంచేయడానికి సిద్ధమవుతుందని విమర్శించారు.

వైయస్ విగ్రహాలుండవు: టి బిసి ఫోరం

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర పేరుతో చేపట్టే యాత్ర మానుకోవాలని తెలంగాణ బిసి ఫోరం హెచ్చరించింది. తెలంగాణ ప్రజలను మోసం చేస్తే ఈ ప్రాంతంలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఉండవన్నారు.

English summary
Telangana leader Jitta Balakrishna Reddy on Sunday 
 
 blamed that YSR Congress Party have no credibility 
 
 and valies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X