భత్కల్ ఫేస్ టు ఫేస్ విచారణ!, తహసీం కోసం గాలింపు
భత్కల్కు మోకా కోర్టు రవాణా వారెంట్
యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను కస్టడీలోకి తీసుకునేందుకు వీలుగా మంబయిలోని మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం(మోకా) ప్రత్యేక కోర్టు రవాణా వారెంటు జారీ చేసింది. 2011లో జరిగిన మూడు బాంబు పేలుళ్లలో 27 మంది మృతి చెందారు. ఈ కేసు విచారణకు సంబంధించి నిందితులిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని మహారాష్ట్రకు చెందిన ఉగ్రవాద నిరోధక దళం మోకా ప్రత్యేక కోర్టుకు విన్నవించుకుంది.
భత్కల్ సహాయకుడి కోసం గాలింపు
భత్కల్ సహాయకుడు మహ్మద్ తహసీం అక్తర్ అలియాసా మోను కోసం ఎన్ఐఏ గాలిస్తోంది. పలు దాడులతో ప్రమేయం ఉందని భావిస్తున్న తహసీం ఆచూకి తెలిపిన వారికి రూ.10లక్షల బహుమతిని ఇదివరకే ప్రకటించారు. అతనికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. బీహారులోని సమస్తిపూర్ జిల్లా మణియారి గ్రామంలోని తహసీం ఇంటికి వెళ్లిన అధికారులు తండ్రిని ప్రశ్నించారు.
దేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన యాసిన్ భత్కల్ అరెస్టు నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ర పోలీసులను ప్రశంసించారు. ఇటువంటి విషయాలపై రాజకీయ నాయకులు మాట్లాడటం భావ్యం కాదన్నారు.