జైలు సిబ్బందికి సంజయ్ సాయం!: నిధుల సేకరణలో..
పుణే: ముంబై పేలుళ్ల కేసు నిందితుడు, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ నెవ 26వ తేదిన బాలగందర్వలో జరగనున్న నిధుల సేకరణ కార్యాక్రమంలో పాల్గొననున్నారు. సంజయ్ దత్ ప్రస్తుతం మహారాష్ట్రలోని పుణే ఎరవాడు జైలులో ఉన్న విషయం తెలిసిందే.
జైల్లో ఉన్న ఆయన తన వంతుగా జైలు అధికారులకు సహకరించనున్నారు. జైలు అధికారులు నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జైలు సిబ్బంది సంక్షేమానికి అవసరమైన నిధులను చేపట్టేందుకు అధికారులు ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 26న చేపట్టారు.
ఇందులో 50 మంది పాల్గొననున్నారు. అందులో సంజయ్ దత్ కూడా ఉన్నారు. ఈ నిధుల సేకరణ కార్యక్రమంలో పాల్గొనే వారిలో సంజయ్ దత్ ఉన్నారని జైలు సూపరింటెండెంట్ యోగేష్ దేశాయ్ చెప్పారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, హోంమంత్రి ఆర్ఆర్ పటేల్లు వచ్చే అవకాశాలున్నాయి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ హిందీ, మరాఠీ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.