ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు ఆదిరాజ్. వయస్సు ఏడేళ్లు. అత్యంత ఖరీదైన లాంబోర్గిని కారును కొని అందులో తన తండ్రిని కూర్చోబెట్టుకుని తిరుగుతానని ఏదో ఒక రోజు ఇది జరిగితీరుతుందని నిత్యం చెప్పేవాడు .ఈ చిన్నారి మాటలు విని అంతా మురిసిపోయేవారు. కానీ ఒకరోజు వచ్చింది అంతా షాక్కు గురయ్యారు. ఆదిరాజ్ చెప్పిన మాటలు నిజం కాలేవనే భయం ఆ తల్లిదండ్రులను పట్టుకుంది.
ఎంతో ముద్దుగా మాట్లాడే ఆదిరాజ్ ఉన్నట్లుండి వెన్నులో నొప్పి వచ్చింది. ఈ నొప్పి రావడంతో ఒక్కసారిగా ఇంట్లో సందడి కనుమరుగైంది. తను కన్న కలలు కూడా దూరమయ్యేలా పరిస్థితులు తయారయ్యాయి. అయితే తనకు ప్రాణహాని కలిగించే ఆరోగ్య సమస్య అయితే కాదుకానీ.. తనకు వెన్నులో వచ్చిన నొప్పి అతడిని మంచానికే పరిమితం చేసింది. చిన్నగా తన కుడికాలులో స్పర్శ ఆగిపోయింది. దీంతో తల్లిదండ్రులు మరోసారి పరీక్షలు ఆదిరాజ్కు చేయించారు. అయితే వారికి వెన్నులో వణుకు పుట్టే వార్త తెలిసింది. ఆదిరాజ్కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఆదిరాజ్ సెంట్రల్ నర్వస్ సిస్టం దెబ్బతినింది. దీంతో శరీరంలోని ఒక్కో అవయవం పనిచేయడం క్రమంగా ఆగిపోతున్నాయి.
శరీరంలోని కింది భాగంలో స్పర్శ కోల్పోయిన ఆదిరాజ్కు క్రమంగా ఇతర సమస్యలు వెంటాడాయి. మూత్రవిసర్జన చేయడం కూడా కష్టంగా మారింది. వెంటనే వినికిడి శక్తిని కోల్పోయాడు. వీటన్నిటిపైన రోజురోజుకు తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు పడిపోతుండటం ఆ తల్లిదండ్రులను మరింత ఆవేదనకు గురిచేస్తోంది. దీంతో ప్రాణాలకే ముప్పు వాటిల్లేలా పరిస్థితి తయారైంది. ఆదిరాజ్ను మెరుగైన చికిత్స కోసం జబల్పూర్ డాక్టర్లు ముంబైకి తరలించారు. ప్రస్తుతం చిన్నారి 52 వారాల పాటు కీమోథెరపీ చికిత్సను పొందుతున్నాడు. క్రమంగా ఆరోగ్యం మెరుగవుతుండటంతో తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. చికిత్సకు తన శరీరం స్పందిస్తోంది. చచ్చుపడిపోయిన కాళ్లల్లో స్పర్శ తెలుస్తోంది.
మొత్తం 52 వారాల కీమోథెరపీ చికిత్సలో భాగంగా ఇప్పటికే 22 వారాల పాటు చికిత్స జరిగింది. ఇప్పటికే చిన్నారిపై తండ్రి తనకున్నదంతా తీసి ఖర్చు చేశాడు. ఇప్పుడు ఆ తండ్రి దగ్గర డబ్బులు లేవు. కేవలం ఆశ తప్ప. టీచర్గా పనిచేస్తూ నెలకు రూ.20వేలు సంపాదించే ఆ తండ్రి ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. తన కొడుకు చికిత్స కోసం ఆ నెల జీతం ఏమాత్రం సరిపోవడం లేదు. ప్రస్తుతం చిన్నారి కోసం తను సెలవు మీద ఉండటంతో వచ్చే ఆ డబ్బులు కూడా రావడం లేదు. జబల్ పూర్ నుంచి ముంబైకి వచ్చి అదే హాస్పిటల్లో చిన్నారితో పాటు ఉండటం, జబల్పూర్లో చదువుతున్న కూతురు స్కూలు ఫీజులు, ఆదిరాజ్ చికిత్సకు అయ్యే ఖర్చులతో తండ్రి తివారీ వద్ద చిల్లిగవ్వ కూడా మిగలలేదు. ఇక చిన్నారి ఆదిరాజ్ మొత్తం చికిత్సకు రూ.9 లక్షలు అవసరం. అంత డబ్బు వారి దగ్గర లేదు. ఆదిరాజ్ ప్రాణాలు దక్కాలంటే మనం ముందడుగు వేసి విరాళాలు ఇద్దాం.
ఎలా సహాయం చేయాలి:
ఆదిరాజ్ మన కుటుంబంలోని సభ్యుడిగానే భావిద్దాం. మన కుటుంబంలో పిల్లలకు ఏమైనా జరిగితే మనం ఊరుకుంటామా? ఆదిరాజ్ ప్రాణాలను కూడా కాపాడుదాం. మీరు ఆదిరాజ్ పట్ల చూపే కరుణ జాలి, అతన్ని కాపాడగలదు. మీకు తోచినంత విరాళంగా ఇవ్వండి. ఆదిరాజ్ను తిరిగి ప్రాణాలతో కాపాడుకుందాం. ఆ కుటుంబం మొత్తం మీవైపే నమ్మకంతో చూస్తోంది. మీ సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఆదిరాజ్ కోసం డొనేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
RECOMMENDED STORIES