ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒక్క పిలుపు ఇస్తే, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఉండవు : బీజేపీ ఎంపీ సోయం బాపురావు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ వైరుధ్యం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు పలుకుతున్న బీజేపీపై టీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. నేరుగా సీఎం కేసీఆర్ బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. పార్టీ ద్వంద విధానాలు అవలంభిస్తుందని ఆయన పలు ఆరోపణలు చేశారు. ఇక బీజేపీ నేతలు ఎంపీలుగా గెలుపోందిన పలు స్థానాల్లో సైతం ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ వాతవరణం నెలకోంటుంది.

ఈనేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ, టీఆర్ఎస్ మాజీ మంత్రుల మధ్య రాజకీయా వైరం మరింత ముదిరింది. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు మాజీ మంత్రి జోగురామన్నపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జైల్లో పెట్టిస్తానని ఆయన హెచ్చరించారు. ఇక యూరేనియం తవ్వకాల్లో అనుమతుల పాపం జోగు రామన్నదే అని, ఆయన ఇందుకు జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు. జోగు రామన్న నక్సలైట్ ప్రాంతాల అభివృద్ది నిధులతో టీఆర్ఎస్ నేతల పోలాలకు రోడ్లు వేసుకున్నారని ఆయన పలు ఆరోపణలు చేశారు. ఇందుకోసం ఆదివాసీలకు డబ్బు ఆశ చూపారని చెప్పారు.

 Adilabad mp soyam bapu rao fires on former minister jogu ramanna

మరోవైపు ఆదివాసిల పోరాటంపై ఆయన గళం విప్పారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితాలో నుండి తోలగించాలని ఆయన ఈ సంధర్భంగా డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆదివాసీల పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించారు. ఆదివాసీలకు తాను ఒక్క పిలుపు ఇస్తే కలెక్టర్ ఆఫీస్‌ గాని ఎస్పీ కార్యాలయాలుగాని ఉండవని ఆయన హెచ్చరించారు.

English summary
Political rivalry between BJP and TRS leaders in Telangana is getting worse day by day.part of this adialabad mp soayam bapu rao fires on former minister jogu ramanna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X