అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో నిన్నటి కన్న తగ్గిన 10 కరోనా కేసులు: 23 మంది మృతి

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో స్వల్పంగా కేసులు తగ్గాయి. 78,992 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,058 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. నిన్న 2068 కరోనా కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటికన్నా 10 కేసులు తగ్గాయి. తాజా కేసులో 19,66,175 మంది వైరస్ బారిన పడ్డారని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

గత 24 గంటల్లో కరోనాతో 23 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,377కి చేరింది. 24 గంటల్లో 2053 మంది కరోనాతో కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 19,31,618కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,180 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,45,63,043 నమూనాలను ఆరోగ్యశాఖ పరీక్షించింది.

2058 people infected corona in andhra pradesh

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.

English summary
last 24 hours 2058 people infect corona in andhra pradesh and 23 people died due to virus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X