రోడ్డు ప్రమాదం లో ఉద్యోగుల మృతి : ఏపి సచివాలయంలో విషాదం..
విధులకు హాజరయ్యేందుకు వెళ్తూ ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందారు. హైదరాబాద్లో నివాసం ఉంటూ ఏపి సచివా లయంలో విధులు నిర్వహిస్తున్నారు. అందులో ఇద్దరూ రెవన్యూ శాఖ ఉద్యుగులే. సూర్యాపేట జిల్లా కోదాద వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆ ఇద్దరు మృత్యవాత పడ్డారు. వీరిద్దరి మృతి వార్త తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులు విషాదంలో మునిగిపోయారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెం దారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ముగ్గురు మృతి చెందారు. మృ తులు అమరావతి సెక్రటేరియట్ ఉద్యోగులుగా గుర్తించారు. మృతుల్లో రెవిన్యూ సెక్షన్ ఆఫీసర్ హరికృష్ణ కాగా, మరొకరు ఐఏయస్ ఆఫీసర్ మన్మోహన్ సింగ్ పీఎస్ భాస్కర్ లుగా గుర్తించారు. వీరు, శని-ఆది వారాలు సచివాయానికి సెలవులు కావటంతో..హైదరాబాద్ లో కుంటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. తిరిగి విధుల్లో చేరేందుకు వస్తుండగా కోదాడ వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో..వారు అక్కడిక్కడే మృతి చెందారు. రోడ్డు ప్రమాదం పై స్థానిక పోలీసుల నుండి వారి బంధువులకు..సచివాలయ ఉద్యోగ సంఘాలకు సమాచారం అందింది.
సమాచారం తెలుసుకున్న వెంటనే సచివాలయ ఉద్యోగ సంఘ నేతలు ఘటనా స్థలికి వెళ్లారు. రోడ్డు ప్రమాదం లో ఏపి సచివాలయ ఉద్యోగులు మరణించటంతో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సంతాపం తెలిపారు. మృతుల కుటంబా లక అండగా ఉంటామని హామీ ఇచ్చారు.