ఏపీ ఓటర్ల తుది జాబితా.. తూగో ఫస్ట్.. విజయనగరం లాస్ట్
Recommended Video
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 24 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 93 లక్షల 12 వేల 192 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఏడాది జనవరి 11 తర్వాత 25 లక్షల 20 వేల 924 మంది ఓటర్లను చేర్చగా.. అందులో వివిధ కారణాలతో 1 లక్ష 41 వేల 823 మంది ఓటర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42 లక్షల 4 వేల 436 మంది ఓటర్లు ఉండగా.. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18 లక్షల 18 వేల 16 మంది ఓటర్లు నమోదయ్యారు.
లోక్సభ పోరుకు 795 నామినేషన్లు.. ఎక్కడెక్కడ ఎన్నెన్ని?.. నిజామాబాద్ లో బ్యాలెట్?
గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని చెప్పొచ్చు. ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. విశాఖ జిల్లాలో ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా 2 లక్షల 50 వేల మంది వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం.