టార్గెట్.. 2024: సోము నియమాకంపై బీజేపీలో జోష్: ఆర్ఎస్ఎస్ ముద్ర: డైహార్డ్ నేతగా: కన్నా సహా
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ పగ్గాలు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజుకు లభించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. బీజేపీలో మొదటి నుంచీ కొనసాగుతోన్న నేతల్లో జోష్ నింపుతోంది. అసలైన బీజేపీ నేతకు పార్టీ అధిష్ఠానం సరైన న్యాయం చేసిందనే అభిప్రాయాలు నెలకొన్నాయి. సోము వీర్రాజు నియామకం పార్టీ దిశ-దశ మార్చేస్తుందని, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావడానికి దోహదపడుతుందని చెబుతున్నారు.
భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా నియమించబడిన ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.. pic.twitter.com/AGRmtayKov
— Kanna Lakshmi Narayana (@klnbjp) July 28, 2020
2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్యాయ పార్టీగా ఆవిర్భవించడానికి అవకాశం లభించినట్టయిందని అంటున్నారు. సోము వీర్రాజు ప్రారంభంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో పని చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. సుమారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. ఇది పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు నాయకులు. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే మనస్తత్వం ఉండటం ఆయనకు ఉన్న ప్రధాన బలం అని, అది ఎన్నికల్లో ఓటుబ్యాంకుగా మారుతుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీతో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఎదుగుతామని జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఉపాధ్యక్షుడు సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. సోముకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 42 ఏళ్లపాటు వివిధ పదవుల్లో ఆయన ఎంతో నిబద్ధతతో పనిచేశారని చెప్పారు. అపార రాజకీయ అనుభవం ఉన్న ఆయన తప్ప పార్టీ పగ్గాలను అందుకోవడానికి మరొకరికి అర్హత లేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీలోని టీడీపీ మాజీలకు చెక్ పెట్టేలా: కన్నాను తొలగించిన రోజే..షోకాజ్ జారీ: భారీ ప్రక్షాళన
శ్రీ @somuveerraju గారు,
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 27, 2020
అనుభవజ్ఞులైన మీ నేతృత్వంలో,ధర్మ పోరాటంలో విజయం సాధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజయ శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తూ,పార్టీ జాతీయ నాయకత్వం మీకు నేతృత్వాన్ని అందించిన సందర్భంలో మీకు ప్రత్యేక శుభాకాంక్షలు,శుభాభినందనలు.@BJP4Andhra pic.twitter.com/143u8Gpmda
సోము నియామకం పట్ల తాజా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వంటి పలువురు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధిష్ఠానం సీనియారిటీకి పట్టం కట్టిందని వ్యాఖ్యానించారు. ఆయన నాయకత్వంలో ఏపీలో బీజేపీ విజయ శిఖరాలను అందుకుంటుందని ఆశిస్తున్నట్లు బండి సంజయ్ కుమార్ చెప్పారు.
Recommended Video
శ్రీ సోము వీర్రాజు గారిని ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా జాతీయ అధ్యక్షుడు శ్రీ @JPNadda నియమించారు. భారతీయ జనతా పార్టీతో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం వున్న వీర్రాజుగారి నాయకత్వంలో బీజేపీ ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతోంది అనటంలో సందేహం లేదు. @BJP4Andhra @somuveerraju pic.twitter.com/yKx91dTt4q
— GVL Narasimha Rao (@GVLNRAO) July 27, 2020
ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన శ్రీ సోము వీర్రాజు గారికి నా అభినందనలు.
— Arvind Dharmapuri (@Arvindharmapuri) July 27, 2020
My heartiest congratulations to the newly appointed president of BJP, Andhra pradesh, Shri Somu Veerraju ji.@BJP4Andhra pic.twitter.com/1xhpkCKHtS
మిత్రులు శ్రీ @somuveerraju గారు @BJP4Andhra రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
— CM Ramesh (@CMRamesh_MP) July 27, 2020
All the best for your new role. pic.twitter.com/2WJitHpBSL