టీడిపి ని టెన్షన్ పెడుతున్న ఎన్ఐఏ విచారణ..! అదికార పార్టీపై మండిపడ్డ రోజా..!!
హైద్రాబాద్ : ఏపీ సియం చంద్రబాబు నాయుడు పై వైసీపి ఎమ్మెల్యే రోజా మరో సారి మండిపడ్డారు. రాష్ట్ర మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఎయిర్ పోర్ట్ లో ప్రతిపక్ష నేతను హతమారిస్తే నేరం కేంద్రం పైకి వెళ్లే ఆస్కారం ఉంది కాబట్టే చంద్రబాబు అలా ప్లాన్ చేసారని సంచల వ్యాఖ్యలు చేసారు. జగన్ పై దాడి కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పజెపితే నిందితుడు శ్రీనివాస్ కు లేని ఇబ్బంది చంద్రబాబు కు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్ లో రెస్టారెంట్ యజమానిని ఇంతవరకు ఎందుకు విచారించలేదని ఆమె నిలదీసారు.
బీజేపీతో లాలూచి పడింది చంద్రబాబేనని. మోదీకి ఊడిగం చేస్తోంది చంద్రబాబేనని ఆమె ఘాటుగా విమర్శించారు. ఏపీలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, బీజేపీపై బురద జల్లి బయటకు వెళ్లడం మళ్లీ అధికారం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంది టీడిపి కాదా? అని రోజా ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర బీజేపి మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్ చేసింది మీరు కాదా? రేపు ఏమైనా కేసులు వస్తే ఆయనతో పనిచేయించుకోవడానికేనా? కేంద్రంపై యుధ్దం అని చెప్పి నీతి అయోగ్ మీటింగ్కు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టింది చంద్రబాబు కాదా? అని విరుచుకు పడ్డారు రోజా. అంతే కాకుండా ఎన్టీఆర్ బయోపిక్కు క్లాప్ కొట్టింది వెంకయ్యనాయుడు కాదా? వీటన్నిటి అర్థం ఏంటి? లాలూచి కాదా? అని ఆమె ఏపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.