ప్రత్యేక హోదా ముగిసిన ఎపిసోడ్...ఎంపీ సుజనా చౌదరీ
గతంలో పార్టీ ఆదేశాల మేరకు ప్రత్యేక హోదాపై పోరాడనని ప్రస్థుతం ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యయనం అని తేల్చి చెప్పారు రాజ్యసభ సభ్యుడు సుజాన చౌదరీ. ఎన్డీఏ నుండి బయటకు వచ్చే సమయంలో తాను చెప్పినా చంద్రబాబు వినకుండా ఇతర నిర్ణయం తీసుకున్నారని అన్నారు.. ఇక తాను ఎలాంటీ కేసులకు బయపడి గాని, వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి బీజేపీలో చేరలేదని తెలిపారు.
ఇక తన జీవీతంలో ఫోర్జరీ, చీటింగ్, మోసం లాంటీ ఎలాంటీ కేసులు లేవని అన్నారు. ఒక ధర్డ్ పార్టీకి చెందిన కేసులో సీబీఐ మరియు ఈడీలు తనను ప్రశ్నించాయని తెలిపారు. దీంతో పాటు తాను ఎలాంటీ నిర్భయ కేసుల్లోగాని ,మీ టూ ఆరోపణలు కూడ లేవని స్పష్టం చేశారు.ఒకవేళ కేసుసులు ఉంటే చట్టలు తమ పనిని తాము చేసుకుపోతాయని ,నాపై ఆరోపణలు నిజమైతే ప్రభుత్వం తనను అనర్హుడిగా ప్రకటిస్తుందని, దాన్ని స్వాగతిస్తానని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కోన్నారు.
ఈనేపథ్యంలోనే బీజేపీలో చేరడం తనకు చాల సంతోషంగా ఉందన్ని చెప్పారు.మరోవైపు టీడీపీని వీడడం బాధగా కూడ ఉందని అన్నారు.రాష్ట్ర్ర ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర రాష్ట్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తానని అన్నారు.