అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హింస, విధ్వంసం.. మనుగడ కోసం నీచ రాజకీయాలు.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు..!

|
Google Oneindia TeluguNews

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ వర్సెస్ వైసీపీ చందంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల దూకుడు ఓ రేంజ్‌లో ఉంటోంది. టీడీపీ నేతలను ఏ పూటకు ఆ పూట ఏకిపారేస్తున్నారు. ఆ క్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం మొదలుపెట్టారు. ముఖ్యంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో పాటు ఆయన తనయుడు లోకేశ్‌పై సంచలన కామెంట్లు చేస్తూ హీట్ పుట్టిస్తున్నారు.

ఆ క్రమంలో తాజాగా ఆదివారం నాడు మరోసారి చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు విజయసాయి. రాజకీయ మనుగడ కోసం ఆయన ఎంత నీచానికైనా దిగజారుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు గారూ. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టిన చరిత్రను మర్చిపోయారా? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది అంటూ ఫైరయ్యారు.

ycp mp vijayasai reddy allegations on ex cm chandrababu naidu

విజయసాయి ట్వీట్ల యుద్దం టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. కొందరు నేతలు ఆయన ట్వీట్లకు సమాధానం కూడా చెబుతున్నారు. అయితే రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజీకి చేరుతుండటంతో ఏపీ రాజకీయాలు చర్చానీయాంశంగా మారాయి. గత టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ నేతలను ఇబ్బందులకు గురిచేశారనే కారణంగానే.. ఇప్పుడు వారికి సమయమొచ్చింది, ప్రతీకారం తీర్చుకుంటున్నారేమో అనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
YCP Rajya Sabha member Vijayasai Reddy criticizes Former AP CM Chandrababu Naidu. Hot comments made on Twitter platform. How bad he is for political survival. He argued that as Chandrababu is the pioneer of violence and destructive politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X