అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల శ్రీరామ్ కు డబుల్ ప్రమోషన్ .. సంతోషంలో పరిటాల అనుచరులు !!

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కు డబల్ ప్రమోషన్ వచ్చింది. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టినట్లుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ లో పరిటాల శ్రీరామ్ కు స్థానం దక్కింది. అంతేకాదు మరో విశేషం కూడా పరిటాల శ్రీరామ్ సంతోషానికి కారణం అవుతోంది.

టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు .. 219 మందికి స్థానం .. యువత ,మహిళలకూ ప్రాధాన్యంటీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు .. 219 మందికి స్థానం .. యువత ,మహిళలకూ ప్రాధాన్యం

 కొడుకు పుట్టిన రోజే టీడీపీ రాష్ట్ర కమిటీలో పరిటాల శ్రీరామ్ కు స్థానం

కొడుకు పుట్టిన రోజే టీడీపీ రాష్ట్ర కమిటీలో పరిటాల శ్రీరామ్ కు స్థానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ దూకుడు చూపించడం కోసం ప్రకటించిన రాష్ట్ర కమిటీలో పరిటాల శ్రీరామ్ కు అధికార ప్రతినిధిగా చోటు దక్కింది. ఇదే సమయంలో పరిటాల శ్రీరామ్ కు కొడుకు పుట్టాడు. పరిటాల కుటుంబంలో మరో తరానికి వారసుడొచ్చాడు. పరిటాల శ్రీరామ్ భార్య ఈరోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కొడుకు పుట్టిన సంతోషంలో ఉన్న పరిటాల శ్రీరామ్, అటు పార్టీలోనూ రాష్ట్ర కమిటీలో స్థానం దక్కడంతో సంతోషంగా ఉన్నారు.

పరిటాల శ్రీరామ్ కు డబల్ ప్రమోషన్ దక్కిందని శ్రేణుల ఆనందం

పరిటాల శ్రీరామ్ కు డబల్ ప్రమోషన్ దక్కిందని శ్రేణుల ఆనందం

అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్ అనుచరులు పరిటాల శ్రీరామ్ కు డబల్ ప్రమోషన్ దక్కిందని తెగ సంబర పడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా శ్రీరామ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పరిటాల రవి మళ్లీ పుట్టాడని సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు అనంత రాజకీయాలలో చక్రం తిప్పటానికి భవిష్యత్ తరం వచ్చేసింది అంటూ తెగ సంబరపడుతున్నారు టిడిపిలో కూడా రాష్ట్ర కమిటీ లో అధికార ప్రతినిధిగా చోటు దక్కించుకుని డబల్ ప్రమోషన్ పొందారు అంటూ విషెస్ చెప్తున్నారు. శ్రీరామ్‌, ఙ్ఞాన దంపతులకు తమ అభినందనలు చెప్తున్నారు . 2017లో పరిటాల శ్రీరామ్ ఆలం ఙ్ఞానను వివాహం చేసుకున్నారు .

ఏపీ సర్కార్ పై పోరాటం చేస్తున్న పరిటాల శ్రీరామ్ కు అధికార ప్రతినిధిగా చోటు

ఏపీ సర్కార్ పై పోరాటం చేస్తున్న పరిటాల శ్రీరామ్ కు అధికార ప్రతినిధిగా చోటు

ఏపీలో గత ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అధికార వైసీపీతో పరిటాల శ్రీరామ్ పోరాటం సాగిస్తున్నారు . అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన టీడీపీ నాయకులలో పరిటాల కుటుంబం కూడా ఉందని ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా పరిటాల శ్రీరామ్ దీటుగా పోరాటం చేశారు . మా పరిటాల కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే ఆ భూమి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తామని, దమ్ముంటే సవాలును స్వీకరించి ఆధారాలు చూపించండి అంటూ చాలెంజ్ చేశారు . అప్పటి నుండి ఇప్పటివరకు అధికార పార్టీతో నిత్యం పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు టీడీపీ అధికార ప్రతినిధిగా స్థానం కల్పించి అధినేత చంద్రబాబు యువనేతకు ప్రాధాన్యతనిచ్చారు.

English summary
Paritala Sriram has been appointed as the spokesperson of the state committee announced by the Telugu Desam Party . At the same time a son was born to Paritala Sriram. Paritala Shriram's wife gave birth to a baby boy today. Paritala Sriram, who is happy with the birth of his son, is also happy to get a post in the state committee within the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X