ఏపీలో ఐదున్నర లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, మరోసారి 10 వేలకు పైగా, 68 మంది మృతి
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. రోజు కనీసం 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో మొత్తం కేసులు ఐదున్నర లక్షలు దాటేశాయి. బుధవారం డిశ్చార్జీల సంఖ్య కూడా తగ్గడం కాస్త ఆందోళన కలిగించింది. పాజిటివ్ కేసులు పెరగగా.. డిశ్చార్జీలు తగ్గకుంటే వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉంది.
ఏపీలో కరోనా కల్లోలం: 10 వేలకు పైగా కేసులు, 74 మంది మృతి..
గత 24 గంటల్లో ఏపీలో 10 వేల 175 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న పదివేల 418 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 5 లక్షల 37 వేల 687కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97 వేల 338 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ తగ్గడంతో 4 లక్షల 35 వేల 647 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనా వైరస్తో 68 మంది చనిపోయారు. దీంతో వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 4 వేల 702కు చేరింది. నిన్న 74 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో 43.80 లక్షల మందికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో తొమ్మిది మంది చొప్పున, కృష్ణా, ప్రకాశంలో ఏడుగురు చొప్పున, అనంతపురం ఆరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున చనిపోయారు.