ఏపీలో కరోనా కల్లోలం: 10 వేలకు పైగా కేసులు, 74 మంది మృతి..
ఆంధ్రప్రదేశ్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గత 24 గంటల్లో మరో 10 వేల కేసులు వచ్చాయి. రోజు పది వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 71,692 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇందులో 10 వేల 418 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో కరోనా వైరస్ మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 27 వేల 512కు చేరింది.
వచ్చేది చలికాలం..!ఆస్తమా రోగుల పట్ల శాపంగా మారనున్న కరోనా.!డబ్ల్యూహెచ్ వో హెచ్చరికలు.!
74 మంది మృతి..
కరోనా వైరస్ మరణాలు బుధవారం కాస్త పెరిగాయి. వైరస్ బారిన పడి 74 మంది మరణించారు. దీంతో వైరస్ వల్ల చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 4 వేల 634కు చేరింది. గత 24 గంటల్లో కడప జిల్లాలో 9 మంది, నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నంలో ఏడుగురు చొప్పున, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున, కృష్ణా, కర్నూలు, శ్రీకాకుళంలో ఐదుగురు చొప్పున, విజయనగరంలో ముగ్గురు, తూర్పు గోదావరిలో ఇద్దరు చనిపోయారు.
బుధవారం కాస్త తగ్గిన డిశ్చార్జీలు
గత కొద్ది రోజులుగా ఏపీలో డిశ్చార్జీల సంఖ్య పెరుగుతోంది. కానీ బుధవారం మాత్రం స్వల్పంగా తగ్గింది. 9 వేల 842 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 5,27,512 పాజిటివ్ కేసులకు గాను, 4,25,607 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 97 వేల 271 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తూర్పుగోదావరిలో అధికంగా..
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. జిల్లాలో 71 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. బుధవారంతో కలిపి రాష్ట్రంలో అత్యధికంగా 71 వేల 85 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని అధికారులు తెలిపారు.