వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో 2లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు... కొత్తగా 10,171 మందికి వైరస్...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10,171 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,06,960 కు చేరింది. కరోనాతో మరో 89 మంది మృతి చెందారు. ఇందులో చిత్తూరులో 10 మంది, అనంతపురంలో 9 మంది, గుంటూరులో 9 మంది, నెల్లూరులో 9 మంది, పశ్చిమ గోదావరిలో 9 మంది, తూర్పు గోదావరిలో ఏడుగురు, కడపలో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కృష్ణాలో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, శ్రీకాకుళం,విజయనగరంలో ముగ్గురు చొప్పున మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 1842కు చేరింది.

గడిచిన 24 గంటల్లో మొత్తం 62,938 కరోనా టెస్టులు చేయగా... ఇందులో ట్రూనాట్ పద్దతిలో 29,154, ర్యాపిడ్ టెస్టింగ్ పద్దతిలో 33,784 టెస్టులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 23,62,270 కరోనా టెస్టులు చేశారు. ఇక మరో 7,594 మంది కరోనా పేషెంట్లు కోలుకుని శుక్రవారం(అగస్టు 7) డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 1,20,464 పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 84,654 యాక్టివ్ కేసులున్నాయి.

10171 new coronavirus cases reported in andhra pradesh on friday

ఇటీవలి కాలంలో ఏపీలో 10వేల కరోనా పాజిటివ్ కేసులు తరుచూగా నమోదవుతున్నాయి. అయితే టెస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాల వారీగా కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకూ అనంతపురం,తూర్పు గోదావరి,కర్నూలుగుంటూరు,చిత్తూరు జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కర్నూలులో అత్యధికంగా 1331, అనంతపురంలో 1100,తూర్పు గోదావరిలో 1270,చిత్తూరులో 980 కేసులు నమోదయ్యాయి.

English summary
10171 new coronavirus cases were reported on Friday,in Andhra Pradesh.More 89 corona patients were dead in the state from last 24 hours,Total number reached 2,06,960.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X