వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్తగా మరో 12 కరోనా కేసులు, 161కి చేరిన బాధితుల సంఖ్య

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. గత 12 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 12 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కు చేరింది. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

ఏపీలో కరోనా విలయం..
ఏపీలో కరోనా వైరస్ కలకలం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకూ కొన్ని జిల్లాలకే పరిమితమైన కేసుల ఉద్ధృతి ఇప్పుడు దాదాపు అన్ని జిల్లాలకూ పాకింది. తాజాగా నిన్న రాత్రి 10 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ పరీక్షించిన శాంపిళ్లలో 12 కొత్త కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 161కు చేరింది.

12 new coronavirus positive cases recorded in ap, total figure raises to 161

టాప్ లో నెల్లూరు, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు..
ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం చూస్తే నెల్లూరు జిల్లా నిన్నటి నుంచి టాప్ గా కొనసాగుతున్నట్లు అర్ధమవుతోంది. నిన్నటికే నెల్లూరులో 24 కేసులు నమోదు కాగా.. రాత్రికి రాత్రే మరో 8 కొత్త కేసులు వచ్చి చేరాయి. దీంతో ఒక్క నెల్లూరు జిల్లాలోనే 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లయింది. ఆ తర్వాతి స్ధానాల్లో కృష్ణా, గుంటూరు ఉన్నాయి. కృష్ణాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23గా నమోదు కాగా.. ఆ తర్వాత 20 కేసులతో గుంటూరు జిల్లా మూడో స్ధానంలో ఉంది.

English summary
12 new coronavirus positive cases detected in andhra pradesh today as total figure raises to 161 now. as per the latest health bulleten released by state govt, nellore district in top with 32 coornavirus positive cases
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X