వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్తగా 1732 పాజిటివ్ కేసులు... మరో 14 మంది మృతి...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 1732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 14 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,47,977కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6828కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,915 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం (నవంబర్ 11) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికంగా, కర్నూలులో అత్యల్పంఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: తూర్పుగోదావరిలో అత్యధికంగా, కర్నూలులో అత్యల్పం

తాజాగా మరో 1761 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గడిచిన 24గంటల్లో మొత్తం 70,405 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 788.63లక్షలకు చేరింది.

1732 new coronavirus cases reported in andhra pradesh

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరిలో 344 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 246 కేసులతో కృష్ణా జిల్లా.. 227 కేసులతో పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. అత్యధికంగా తూర్పు గోదావరిలో ఇప్పటివరకూ 1,19,501 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తాజాగా నమోదైన మరణాల్లో...కృష్ణా జిల్లాలో ముగ్గురు,అనంతపురం,చిత్తూరు,విశాఖపట్నం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇద్దరు,తూర్పు గోదావరి,గుంటూరు,నెల్లూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.

Recommended Video

COVID -19 : ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా సెకండ్ వేవ్.. అప్రమత్తంగా ఉండాలంటున్న WHO

ఇక దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,36,011లక్షలకు చేరింది. గడిచిన 24గంటల్లో కొత్తగా 44,281 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా మరో 512 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,27,571కి చేరింది. ప్రస్తుతం దేశంలో కేవలం 4,94,657 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకూ 80,13,783 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.దీంతో జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.79శాతానికి చేరింది. మరణాల రేటు 1.48శాతంగా ఉంది.

English summary
1732 new coronavirus cases were reported in Andhra Pradesh from last 24 hours,more 14 patients were died. Total cases number reached to 8,47,977 and total death toll reached to 6828.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X