'అనంత'లో బోల్తా పడ్డ కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సు: 18 మందికి గాయాలు
అనంతపురం: హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున వోల్వో బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.
బెంగళూరు నుంచి కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
4 కిలోల బంగారం చోరీ:
కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో మహబూబ్నగర్ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాల స్టేజీ వద్ద 4 కిలోల బంగారం చోరీకి గురైంది. ఇటిక్యాలపాడు వద్ద టీ తాగేందుకు బస్సు ఆపినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
బంగారంతో ఆగంతకుడు కారులో పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.