అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'అనంత'లో బోల్తా పడ్డ కేఎస్ఆర్టీసీ వోల్వో బస్సు: 18 మందికి గాయాలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అనంతపురం: హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున వోల్వో బస్సు బోల్తా పడింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి.

18 people injured in KSRTC Bus Accident at Anantapur

బెంగళూరు నుంచి కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం వెళ్తున్న ఈ బస్సులో 18 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ప్రమాదంలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

4 కిలోల బంగారం చోరీ:

కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్న కేశినేని ట్రావెల్స్‌ బస్సులో మహబూబ్‌నగర్‌ జిల్లా మానవపాడు మండలం ఇటిక్యాల స్టేజీ వద్ద 4 కిలోల బంగారం చోరీకి గురైంది. ఇటిక్యాలపాడు వద్ద టీ తాగేందుకు బస్సు ఆపినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

బంగారంతో ఆగంతకుడు కారులో పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

English summary
18 people injured in KSRTC Bus Accident at Anantapur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X