సీ-ఓటర్ సర్వే: టీడీపీకి 14 లోక్ సభ స్థానాలు?
న్యూఢిల్లీ: ఎన్నికల ముంగిట్లో వరుసగా చోటు చేసుకుంటున్న వలసలతో డీలా పడింది తెలుగుదేశం పార్టీ. సీనియర్లందరూ ప్రతిపక్ష పార్టీ వైపు వలస వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి రావడం కల్లే అనే అభిప్రాయాలు ఉన్నాయి. దీనికితోడు- ఇదివరకు వెల్లడైన సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి.
రాయపాటీ..పరిస్థితేంటీ? టీడీపీ తరఫున రేసులోకి వచ్చిన లగడపాటి
ఈ పరిస్థితుల్లో తాజాగా చోటు చేసుకున్న సర్వే ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఊరట నిచ్చేలా ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న 25 లోక్ సభ స్థానాలకు గాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 14 సీట్లలో విజయబావుటా ఎగర వేస్తుందంటూ వెల్లడించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే సీ- ఓటర్ తన సర్వేను ప్రకటించింది. దేశవ్యాప్తంగా నరేంద్రమోడీ హవా వీస్తోందని అభిప్రాయపడింది.
కేంద్రంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సీ-ఓటర్ సర్వే తేటతెల్లం చేసింది. మొత్తం 543 లోక్ సభ స్థానాల్లో ఎన్డీఏకు 264 సీట్లు, కాంగ్రెస్ కు 141 స్థానాలు లభిస్తాయని పేర్కొంది. రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాల్లో 14 టీడీపీ, 11 సీట్లను వైఎస్ఆర్ సీపీ గెలుచుకుంటుందని అంచనా వేసింది.