coronavirus: ఏపీలో 23 పాజిటివ్ కేసులు, 525కి చేరిన సంఖ్య, 14 మంది మృతి..
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరో 23 నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 525కి చేరుకుంది. వీరిలో 20 మంది కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 14 మంది మాత్రం వైరస్తో చనిపోయారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో ప్రస్తుతం 491 మందికి చికిత్స అందిస్తున్నారు.
బుధవారం నిర్వహించిన పరీక్షలో కర్నూలులో అత్యధికంగా 13 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 4, కడపలో 3, నెల్లూరులో 2, అనంతపూర్లో ఒక్క కేసు నమోదైంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 118 మంది రోగులకు చికిత్స అందిస్తున్నారు. తర్వాత కర్నూలులో 108 మంది చికిత్స పొందుతున్నారు. మరణాలు కూడా గుంటూరు, కృష్ణా జిల్లాలో నాలుగు చొప్పున జరిగాయి. విశాఖపట్టణంలో 10, తూర్పు గోదావరిలో 14 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాకపోవడం ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశం.
విశాఖపట్టణం జిల్లాకు చెందిన నలుగురిని బుధవారం వైద్యులు డిశ్చార్జ్ చేశారు. గతనెల 30వ తేదీన కరోనా వైరస్ లక్షణాలతో విశాఖలోని జీహెచ్ సీసీడీ ఆస్పత్రిలో వీరు చేరారు. డాక్టర్ రాజు, సూపరింటెండెంట్ ద్వారకానాథ్ నేతృత్వంలో వీరికి రెండుసార్లు రెండుసార్లు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు.