వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో కొత్తగా 2997 పాజిటివ్ కేసులు... మరో 21 మంది మృతి...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2997 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 21 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6587కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,419 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం(అక్టోబర్ 25) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Recommended Video

Andhra Pradesh : 2997 New Covid 19 Cases Reported In AP | Oneindia Telugu

గడిచిన 24 గంటల్లో 3585 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 6,36,508కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 67,419 శాంపిల్స్‌ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 75,70,302కు చేరింది.

2997 new coronavirus cases reported in andhra pradesh

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 466 కేసులతో చిత్తూరు,358 కేసులతో కృష్ణా జిల్లా ఉన్నాయి. ఇప్పటివరకూ అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,07,469 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇక తాజాగా నమోదైన మరణాల్లో... చిత్తూరులో ఐదుగురు,కడపలో ముగ్గురు,అనంతపురం,తూర్పు గోదావరి, కృష్ణా,విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున,విజయనగరం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

English summary
2997 new coronavirus cases were reported in Andhra Pradesh from last 24 hours,more 41 patients were died. Total cases number reached to 8,07,023 and total death toll reached to 6587.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X