ఏపీలో కొత్తగా 2997 పాజిటివ్ కేసులు... మరో 21 మంది మృతి...
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2997 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 21 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6587కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,419 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం(అక్టోబర్ 25) హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Recommended Video
గడిచిన 24 గంటల్లో 3585 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 6,36,508కి చేరింది. గడిచిన 24గంటల్లో మొత్తం 67,419 శాంపిల్స్ పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 75,70,302కు చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 492 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో 466 కేసులతో చిత్తూరు,358 కేసులతో కృష్ణా జిల్లా ఉన్నాయి. ఇప్పటివరకూ అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,07,469 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇక తాజాగా నమోదైన మరణాల్లో... చిత్తూరులో ఐదుగురు,కడపలో ముగ్గురు,అనంతపురం,తూర్పు గోదావరి, కృష్ణా,విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు చొప్పున,విజయనగరం,పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.