ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైవేపై కారులో చెలరేగిన మంటలు: ముగ్గురు సజీవదహనం

|
Google Oneindia TeluguNews

కర్నూలు: జిల్లాలోని ఆళ్లగడ్డ సమీపంలో బత్తలూరు వద్ద 40వ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వైపు వెళుతున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనున్న మట్టికుప్పలను ఢీకొంది.

ప్రమాదం జరిగిన వెంటనే కారులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు సజీవదహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన రాజాప్రసాద్‌ అనే వ్యక్తిని నంద్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

3 of a family burnt alive as car catches fire in Kurnool district

బాధితులు ప్రొద్దుటూరుకు చెందిన వనితాబాయి, పిల్లలు ప్రేమ్‌కుమార్‌(5), ఉమేష్‌(2)లుగా గుర్తించారు. ఆళ్లగడ్డ సీఐ దస్తగిరిబాబు ఘటనాస్థలిని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Three of a family burnt alive when a speeding car rammed into a sand mound near the roadside and caught fire at Battalur of Allagadda mandal in Kurnool district on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X