ఆవిరైన ఆశలు: శోకసంద్రమైన విశాఖ కేజీహెచ్ మార్చురీ (ఫోటోలు)
విశాఖపట్నం: నగరంలోని ఆర్కే బీచ్లో గల్లంతైన ముగ్గురు విద్యార్ధులు, ఒక యువకుడి మృతదేహాలు సోమవారం ఒడ్డుకు చేరాయి. అల్లిపురంలోని ప్రియాంక విద్యోదయ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్ధులు, ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక యువకుడు ఆదివారం గోకుల్ పార్క్ తీరంలో స్నానం చేస్తుండగా గల్లంతైన సంగతి తెలిసిందే.
అయితే ముగ్గురు విద్యార్ధుల్లో కె. రోహిత్ (15), అబ్దుల్ జబ్బార్ (14) మృతదేహాలు సోమవారం ఉదయం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇక ఉత్తరప్రదేశ్కు చెందిన షరీక్ ఖాన్ (19) మృతదేహం కూడా గల్లంతైన చోటే దొరికింది. మృతుల్లో ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు కావడంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
శోకసంద్రమైన విశాఖ కేజీహెచ్ మార్చురీ
ప్రియాంక విద్యోదయ విద్యార్ధులు కేజీహెచ్ మార్చరీ తీసుకొచ్చారని తెలుసుకున్న ఇతర విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, స్నేహితులు పెద్ద ఎత్తున కేజీహెచ్ మార్చరీకి చేరుకున్నారు. నిన్నటి వరకూ క్లాస్ రూమ్లో తమతో పాటు కూర్చొని పాఠాలు విన్న తోటివారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి వారంతా కంట నీరు పెట్టారు.
శోకసంద్రమైన విశాఖ కేజీహెచ్ మార్చురీ
దసరా సెలవులు ఇచ్చారుగా బీచ్లోకి వెళ్లి ఆడుకుందాంరారా అంటూ ఓ మిత్రుడు రోహిత్ ఇంటికి వచ్చి పిలిచాడు. మధ్యాహ్నాం మూడు గంటలకు ఏం ఆటలు బాబూ సాయంత్రం వెళ్దురుగానిలే అని రోహిత్ తండ్రి శ్రీనివాస్ వారించాడు. నాన్నా ఒక గంటలో ఆడుకుని వచ్చేస్తామని చెప్పి రోహిత్ వెళ్లాడు.
శోకసంద్రమైన విశాఖ కేజీహెచ్ మార్చురీ
ఇక అంతే మళ్లీ తిరిగిరాలేదు. క్రికెట్ ఆడుకుంటానని వెళ్లిన కొడుకు విగతజీవిగా తీరానికి కొట్టుకురావడంతో శ్రీనివాస్ కన్నీటి పర్వంతమయ్యాడు. ఇక అల్లిపురం నీలమ్మవేప చెట్టు సమీపంలో నివాసముంటున్న శ్రీనివాస్ ట్యాక్సీ డ్రైవర్.
శోకసంద్రమైన విశాఖ కేజీహెచ్ మార్చురీ
ఇక అల్లిపురం జెండా చెట్టు ప్రాంతంలో నివాసముంటున్న అబ్దుల్ సాధిక్ జిలానీ డాల్ఫిన్ హోటల్ ప్రాంతంలో పాత బ్యాటరీలను విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అబ్దుల్ జబ్బార్ నాలుగో సంతానం. అందిరిలో తెలివైన వాడు కావడం, పరీక్షల్లో చక్కటి మార్కులు తెచ్చుకోవడాన్ని చూసిన తండ్రి తన బిడ్డ ఉన్నత స్ధాయికి చేరుకుంటాడని కలలు కన్నారు.
శోకసంద్రమైన విశాఖ కేజీహెచ్ మార్చురీ
రోహిత్, అబ్ధుల్ జబ్బార్, గణేష్లకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. వీరు పాఠశాలలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. పరీక్షల్లో సైతం మంచి మార్కులు సాధించడం, బడిలో ఎంతో క్రమశిక్షణతో మెలిగేవారని, మంచి భవిష్యత్ ఉన్న ఈ ముగ్గురు విగతజీవులుగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.