ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, ఒకరు మృతి, కోయంబేడ్ మార్కెట్తో 6 కేసులు
అమరావతి:
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
కరోనా
కేసులు
క్రమంగా
పెరుగుతున్నాయి.
గడిచిన
24
గంటల్లో
రాష్ట్ర
వ్యాప్తంగా
11,638
నమూనాలు
పరీక్షించగా
33
మందికి
కరోనా
పాజిటివ్గా
తేలినట్లు
శుక్రవారం
మీడియా
విడుదల
చేసిన
బులిటెన్లో
వైద్య
ఆరోగ్య
శాఖ
తెలిపింది.
తాజాగా నమోదైన 33 కేసులతో మొత్తం కేసుల సంఖ్య 2874కు చేరింది. మరో 79 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 777కు చేరింది.
కాగా,
రాష్ట్రంలో
అత్యధికంగా
కర్నూలు
జిల్లాలో
650కిపైగా
పాజిటివ్
కేసులు
నమోదయ్యాయి.
ఆ
తర్వాత
గుంటూరు
జిల్లాలో
400కుపైగా
కేసులు
ఉన్నాయి.
రాష్ట్ర
వ్యాప్తంగా
ఇప్పటి
వరకు
2037
మందికి
నెగిటివ్
రావడంతో
వారిని
ఆస్పత్రుల
నుంచి
డిశ్చార్జ్
చేశారు.
కరోనా బారినపడి మొత్తం 60 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో కరోనా వల్ల ఒకరు మృతి చెందారు. కాగా, తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ వల్ల శుక్రవారం మరో ఆరుగురికి కరోనా సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
చిత్తూరు జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరికి కోయంబేడు మార్కెట్ కారణంగా కరోనా సోకినట్లు తెలిపింది. అలాగే విదేశాల నుంచి వచ్చినవారిలో కూడా కొన్ని కేసులున్నాయి. కాగా, ఇప్పటి వరకు దేశంలో 1,67,442 కరోనా కేసులు నమోదయ్యాయి. 4797 మరణాలు సంభవించాయి.