ఏపీలో 48 పాజిటివ్ కేసులు, 31 మందికి కోయంబేడు లింకులు, కర్నూలులో ఒకరి మృతి...
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 24 గంటల్లో 9 వేల 628 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 48 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 31 మంది కోయంబేడు మార్కెట్ లింకులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 48 కేసులతో వైరస్ సోకిన మొత్తం సంఖ్య 2205కి చేరింది. 24 గంటల్లో కరోనా వైరస్ వల్ల ఒకరు చనిపోయారు. కర్నూలు జిల్లాలో చికిత్స పొందుతున్న ఒకరు మృతిచెందారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 49కి చేరింది.
వైరస్ తగ్గడంతో 1353 మందిని డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం 803 మందికి ఆస్పత్రిల్లో చికిత్స అందిస్తున్నారు. కర్నూలులో కరోనా వైరస్ నియంత్రణలోకి రావడం లేదు. 9 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 608కి చేరింది. గుంటూరు జిల్లాలో కూడా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 413కి చేరింది.
నెల్లూరు జిల్లాలో కూడా 9 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 8, కృష్ణ జిల్లాలో 7 కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన వారి పాజిటివ్ కేసుల సంఖ్య 150కి చేరింది. ఒడిశా 10, మహారాష్ట్ర 101, గుజరాత్ 26, కర్ణాటక 1, పశ్చిమబెంగాల్ 1, రాజస్థాన్ 11 కేసులు ఉన్నాయి.