కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో 68: 24 గంటల్లో పాజిటివ్ కేసులు.. కర్నూలులో ఒకరి మృతి.. 53కి చేరిన మృతులు...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కరాళనృత్యం చేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తగిన చర్యలు తీసుకుంటున్న కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 9 వేల 159 మందికి పరీక్షలు చేయగా.. 68 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 2407కి చేరింది. కరోనా వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 43 మందిని డిశ్చార్జ్ చేశారు. దీంతో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1639కి చేరింది.

ప్రస్తుతం 715 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందజేస్తున్నామని వైద్యారోగ్యశాఖ తెలిపింది. కరోనా వైరస్‌తో బుధవారం ఒకరు కర్నూలులో చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 53కి చేరింది. బుధవారం నమోదైన 68 కేసుల్లో చిత్తూరు 6, నెల్లూరు 4, కోయంబేడు నుంచి 10 మంది వచ్చారని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రేపటినుంచి రాష్ట్రంలో బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతరాష్ట్ర బస్సులు మాత్రం నడపబోమని తేల్చిచెప్పింది.

68 coronavirus positive cases register in andhra pradesh
English summary
Last 24 hours 68 coronavirus positive cases register in andhra pradesh health officials said in statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X