వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం... ఏడుగురు మృతి... నలుగురి పరిస్థితి విషమం..
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి సమీపంలో ట్రాక్టర్-లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం.
మృతులను ఖమ్మం జిల్లా మధిర వాసులుగా గుర్తించారు. మధిర మండలంలోని గోపవరం నుంచి 25 మంది గ్రామస్తులు ట్రాక్టర్లో దైవ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
krishna district lorry tractor accident Road accident andhra pradesh కృష్ణా జిల్లా లారీ ట్రాక్టర్ రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్
English summary
7 killed in an accident on Wednesday after a tractor and lorry collided in Vedadri in Krishna District. Police registered a case on accident and started enquiry.
Story first published: Wednesday, June 17, 2020, 15:07 [IST]