ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు: 12వేల మార్క్ దాటాయి, మరో 11 మరణాలు, జిల్లాల వారీగా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. టెస్టుల సంఖ్య పెంచుతున్న కొద్దీ.. కేసులు కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.
భారీగా పెరిగిన కేసులు, 11 మరణాలు..
గత 24 గంటల్లో మరో 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 51 మంది, ఇతర దేశాల నుంచి ఐదుగురు ఉన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,285కు చేరింది. గడిచిన24 గంటల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 157కు చేరింది.
జిల్లాల వారీగా కొత్త కేసులు
గత
24
గంటల్లో
263
మంది
కోలుకున్నారని
ఆరోగ్యశాఖ
తెలిపింది.
దీంతో
కరోనా
నుంచి
కోలుకున్నవారి
సంఖ్య
5289కు
చేరింది.
మరో
6648
యాక్టివ్
కేసులున్నాయి.
గత
24
గంటల్లో
అత్యధికంగా
అనంతపురం
జిల్లాలో
161,
తూర్పుగోదావరి
జిల్లాలో
109,
చిత్తూరు
జిల్లాలో
84,
గుంటూరు
జిల్లాలో
71,
కర్నూలు
జిల్లాలో
69,
కృష్ణాలో
53,
కడప
జిల్లాలో
50,
పశ్చిమగోదావరి
జిల్లాలో
44,
విశాఖపట్నంలో
34,
ప్రకాశంలో
26,
నెల్లూరులో
24,
విజయనగరం
జిల్లాలో
15
కేసులు
నమోదయ్యాయి.
అత్యధిక కేసులు నమోదైన జిల్లాలు..
కాగా,
రాష్ట్రంలో
అత్యధికంగా
కర్నూలు
జిల్లాలో
1684
పాజిటివ్
కేసులుండగా,
ఆ
తర్వాత
అనంతపురం
జిల్లాలో
1320
కేసులు
ఉన్నాయి.
కృష్ణా
జిల్లాలో
1252కు
చేరాయి.
గుంటూరు
జిల్లాలో
1103,
తూర్పుగోదావరి
జిల్లా
945,
చిత్తూరు
జిల్లా
809,
పశ్చిమగోదావరిలో
804,
కడపలో
683,
నెల్లూరులో
561,
విశాఖపట్నంలో
461,
ప్రకాశంలో
272,
విజయనగరంలో
137,
శ్రీకాకుళంలో
62,
ఇతరులు
56
నమోదయ్యాయి.
Recommended Video
దేశంలో 5 లక్షలు దాటిన కేసులు..
ఇక
దేశ
వ్యాప్తంగా
5,10,692
కరోనా
పాజిటివ్
కేసులు
నమోదు
అయ్యాయి.
వీటిలో
1,98,541
యాక్టివ్
కేసులుగా
ఉన్నాయి.
దేశంలో
ఇప్పటి
వరకు
2,96,381
మంది
కరోనా
నుంచి
కోలుకుని
వివిధ
ఆస్పత్రుల
నుంచి
డిశ్చార్జ్
అయ్యారు.
ఇప్పటి
వరకు
కరోనా
బారినపడి
15,712
మంది
మరణించారు.