ఏపీలో భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు: 67 మరోణాలు, అనంతపురంలో అత్యధిక కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉంది. పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 64,147 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 9747 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో 21 లక్షల కరోనా పరీక్షలు.. భారీగా నమోదైన కేసులు
తాజాగా నమోదైన 9747 కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,76,333కి చేరింది. ప్రస్తుతం 79,104 యాక్టివ్ కేసులున్నాయి. తాజాగా, 6953 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా 95,625 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 21,75,070 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
గుంటూరులో అత్యధిక మరణాలు.
గత 24 గంటల్లో 67 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1604 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడి గుంటూరులో 12 మంది, కృష్ణాలో 9 మంది, కర్నూలులో 8 మంది, చిత్తూరులో ఏడుగురు, తూర్పుగోదావరిలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఇద్దరు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.
అనంతపురంలో అత్యధిక కేసులు
కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో జిల్లాల వారీగా.. అనంతపురంలో 3325, చిత్తూరులో 526, తూర్పుగోదావరిలో 1371, గుంటూరులో 940, కడపలో 765, కృష్ణాలో 420, కర్నూలులో 1016, నెల్లూరులో 557, ప్రకాశంలో 224, శ్రీకాకుళంలో 537, విశాఖపట్నంలో 863, విజయనగరంలో 591, పశ్చిమగోదావరిలో 612 మంది కరోనా బారినపడ్డారు.
Recommended Video
మూడో స్థానంలో ఏపీ..
ఇక దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,01,334కు చేరింది.5,83,014 యాక్టివ్ కేసులున్నాయి. 12,78,084 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 39,787 మంది కరోనాతో మృతి చెందారు. దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.