విషాదం: బ్యాంకాక్లో స్విమ్మింగ్ ఫూల్లో పడి ఏపీ యువకుడు మృతి
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు బ్యాంకాక్లో మృతి చెందారు. ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ ఫూల్లో పడటంతో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
వెంకటేశ్ ప్రస్తుతం హైదరాబాద్లోని హెచ్డీఎఫ్సీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. బ్యాంకు పనినిమిత్తం ఇటీవలే అతను బ్యాంకాక్ వెళ్లాడు. ఈ ఘటనపై కుటుంబసభ్యులకు అక్కడి అధికారులు సమాచారమందించారు.
కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెంకటేష్ మృతితో ఆయన కుటుంబంతోపాటు స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
andhra pradesh Bangkok youth died Krishna vijayawada machilipatnam ఆంధ్రప్రదేశ్ బ్యాంకాక్ యువకుడు మృతి విజయవాడ మచిలీపట్నం
English summary
A Andhra Pradesh youth, who is belongs to Krishna district, died in Bangkok.
Story first published: Tuesday, August 14, 2018, 10:53 [IST]