అలిపిరి లోయలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం: పోలీసులకు సెల్ఫీ, విషయం చెప్పింది!
చిత్తూరు: తిరుమల చేరుకునే అలిపిరి కాలినడక మార్గంలో లోయలో దూకిన ఓ యువతి తీవ్రగాయాలపాలైంది. అయితే, అవాచారికోన లోయలో తాను దూకానని, తీవ్రంగా గాయపడిన తనను రక్షించాలంటూ ఆమే స్వయంగా పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం గమనార్హం.
అంతేగాక, ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ దిగి పోలీసులకు పంపించడం గమనార్హం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానిిక చేరుకున్నారు.
అటవీశాఖ, అగ్నిమాపక సిబ్బంది, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి యువత కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి ఆచూకీని కనుగొన్న పోలీసులు.. వెంటనే ఆమెను ో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసిగా ఫోన్లో తనకు తాను ఆ యువతి పరిచయం చేసుకుంది. కుటుంబ సభ్యులతో గొడవే ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆ యువతి తెలిపింది.