మరుగుతున్న పాలలో పడి చిన్నారి మృతి: రోడ్డుపై బైక్ దహనం(ఫొటో)
వరంగల్: జిల్లాలోని మంగపేట మండలం కమలాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ స్వీట్షాప్లోని మరుగుతున్న పాలల్లో పడి చిన్నారి మృతిచెందింది. బుధవారం జరిగిన ఈ సంఘటనతో కమలాపూర్లో విషాదం నెలకొంది.
చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదకరమైన ఆ చోటుకు ఆ బాలికను ఎందుకు రానిచ్చారు? ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉప్పల్లో బైక్లో నుంచి మంటలు
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్లో ఓ బైక్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో జనాలు పరుగులు తీశారు. ఇతర వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. దీంతో ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది.
Comments
English summary
A girl child allegedly died after falling in hot milk in Warangal district.
Story first published: Wednesday, April 8, 2015, 17:17 [IST]