కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భర్త మరణించాడనే వేదనతో భార్య ఆత్మహత్య, కడపలో విషాదం

సౌదీ అరేబియా, యెమెన్ దేశాల ఉగ్రవాదుల బాంబు దాదిలో కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. అయితే భర్త మరణాన్ని తట్టుకోలేకు భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. దుబాయ్ లో మరణించిన భర్త మృతదేహం రాకముంద

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప:సౌదీ అరేబియా, యెమెన్ దేశాల ఉగ్రవాదుల బాంబు దాదిలో కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. అయితే భర్త మరణాన్ని తట్టుకోలేకు భార్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. దుబాయ్ లో మరణించిన భర్త మృతదేహం రాకముందే భార్య ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.

కడప జిల్లా అట్లూరు మండలం కమలకూరుకు చెందిన వెంకటసుబ్బారెడ్డి ఈ నెల 7వ, తేదిన సౌదీలో మరణించాడు. సోమశిల ముంపు పరిహరం కింద వచ్చిన డబ్బులతో 1980లో ఇంటిని నిర్మించాడు. అయితే ఈ పరిహరం డబ్బులు సరిపోలేదు. పది నెలల క్రితం రూ.3 లక్షలు అప్పు చేసి కువైట్ కు వెళ్ళాడు.

A lady committed suicide in Kadapa district

అక్కడ పరిస్థితులు సహకరించలేదు. దీంతో ఆయన అక్కడి నుండి తిరిగి వచ్చాడు. మరో లక్షన్నర అప్పు చేసీ సౌదీకి వెళ్ళాడు. కార్ల సర్వీసింగ్ సెంటర్ లో ఆయన పనికి కుదిరాడు.అంత కుదురుకొంటుందనే సమయంలోనే ఈ నెల 7వ, తేదిన బాంబు పేలి ఆయన చనిపోయాడు.

సౌదీలో బాంబు దాడిలో వెంకటసుబ్బారెడ్డి మరణించిన భార్యకు సమాచారం అందించారు. ఈ విషయం తెలిసినప్పటీ నుండి భార్య ఈశ్వరమ్మ తీవ్ర మనస్థాపానికి గురైంది. బుదవారం నాడు ఆమె కమలకూరులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. వారికి ఇద్దరు పిల్లలు. ఒకరు ఎల్ కే జీ చదువుతుండగా, మరో అబ్బాయి మూడో తరగతి చదువుతున్నాడు.

English summary
A lady committed suicide in Kadapa district on Wednesday. Venkat subba Reddy died in Soudi Arabia on 7 April.She disappointed for her husband's death news, then she suicide said local people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X