గొంతుకోసి, బండారాయితో మోది,లోయలో ఇలా, వివాహేతర సంబంధమే కారణమా?
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు వివాహేతర సంబందమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలోని పలకల క్వారీలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు వివాహేతర సంబందమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పెద్దగుడిపాడు గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ తన పుట్టింటికి వెళ్ళింది. అయితే వరుసకు మరిది అయ్యే బాల వెంకటేశ్వర్లుతో కలిసి ఆమె బైక్ పై పుట్టింటికి వెళ్ళింది.
అయితే పుట్టింటికి వెళ్ళిన అరుణ అక్కడ ఉండకుండా తిరిగి ఇంటికి బయలుదేరింది.అయితే మార్గమథ్యలో బాలవెంకటేశ్వర్లుకు అరుణకు వాగ్వాదం అయింది. ఈ వాగ్వాదం కారణంగా అరుణను బండరాయితో మోది, కత్తితో గొంతుకోసి బాలవెంకటేశ్వర్లు హత్య చేశాడు.
పలకల క్వారీలో అరుణ మృతదేహన్ని వేసి ఏమి తెలియనట్టుగానే ఇంటికి వచ్చాడు. అయితే అరుణ పుట్టింట్లో లేకపోవడం,ఇంటికి రాకపోవడంతో అరుణ భర్త బాలు బాల వెంకటేశ్వర్లును నిలదీశాడు. దీంతో బాల వెంకటేశ్వర్లు అసలు విషయం చెప్పాడు.
బాలు ఫిర్యాదు మేరకు పోలీసులు బాల వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకొని విచారించారు. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పరిశీలించారు. అరుణను బండరాయితో మోది కత్తితో గొంతుకోసినట్టు నిందితుడు తెలిపాడు. మృతదేహన్ని 40 అడుగుల లోతున్న పలకల క్వారీలో పడవేశాడు. హత్యకు వివాహేతర సంబంధం కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.