అనుమానంతో భార్యను సజీవ దహనం చేసిన భర్త
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమె భర్తే.. ఆమెను సజీవదహనం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు
గుంటూరు: జిల్లాలోని వట్టిచెరుకూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమె భర్తే.. ఆమెను సజీవదహనం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లకు చెందిన అరుణ(28)కు, వట్టిచెరుకూరుకు చెందిన సుధాకర్తో 12 సంవత్సరాల కిందట వివాహమైంది. వీరికి కుమారుడు జగదీష్, కుమార్తె స్వీటీ ఉన్నారు.
భార్యకు వివాహేతర సంబంధం ఉందని భర్త తరచూ వేధిస్తుండేవాడు. దీంతో నెల రోజుల కిందట పుట్టింటికి వెళ్లింది. ఇటీవల ఇద్దరం కలసి వివాదాలు లేకుండా కాపురం చేసుకుందామని నచ్చ జెప్పి సుధాకర్ ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు.
కాగా, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు వరి గడ్డి కడెం కడదామని చెప్పి పొలానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెను కర్రతో విచక్షణా రహితంగా కొట్టి పెట్రోలు పోసి సజీవ దహనం చేశాడని పోలీసులు తెలిపారు. అంతేగాక, నిందితుడే పోలీస్ స్టేషన్కు వచ్చి తన భార్యను చంపినట్లు అంగీకరించాడని పోలీసులు చెప్పారు.