ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య... విడాకులు ఇవ్వడంతో తల నరికి, వేరు చేసిన భర్త...!
విజయవాడ సత్యనారయణపురంలో దారుణం చేటుచేసుకుంది. భార్య విడాకులు ఇచ్చిందని కక్ష్య పెంచుకున్న భర్త ఆమేను నరికి చంపాడు. అనంతరం తల, మొండాన్ని వేరు చేశాడు. తలను తీసుకుని బయటకు వచ్చాడు. దీంతో గ్రామస్థులకు ఒక్కసారిగా బయాందోళనలకు గురి అయ్యారు. అయితే తలకు తీసుకుని బయటకు వచ్చిన నిందితుడు దాన్ని బుడమేరులో పడేశాడు.
విజవాడలో భార్య తలనరికిన భర్త
విజయవాడలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ప్రదీప్కు అదే కాలనీకి చెందిన మణిక్రాంతి అనే యువతిని ప్రేమించి గత పది సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం వరకు ఇద్దరి కాపురం సాజావుగానే కొనసాగింది. కాగా గత రెండు మూడు సంవత్సాల నుండి ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భర్త పెట్టే వేధింపులు తట్టుకోలేక మణిక్రాంతి పలుసార్లు పోలీసుస్టేషన్లో పిర్యాధు చేసింది. కాని భర్తలో ఎలాంటీ మార్పు రాలేదు.
భార్య విడాకులు ఇవ్వడం ఇష్టం లేని భర్త
దీంతో భర్తనుండి మణిక్రాంతి విడాకులు తీసుకోవాలని నిర్ణయించింది. విడాకులకుపై కోర్టులు విచారణ కొనసాగుతోంది.తాజాగా విడాకుల కేసు వాదనలు కూడ చివరి దశకు చేరుకున్నాయి. అయితే భార్య విడాకులు తీసుకోవాలనే నిర్ణయం భర్త ప్రదీప్కు నచ్చలేదు. తాను విడాకులు ఇవ్వడానికి ఇష్టపడేలేదు. దీంతో భార్యకు నచ్చజెప్పినా ఆమే వినలేదు. ఈనేపథ్యంలోనే భార్యపై కక్ష్య పెంచుకున్నాడు ప్రదీప్. కట్టుకున్న భార్య అని కూడ చూడకుండా కడతేర్చాలనే స్కెచ్ వేశాడు. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆమెపై కత్తితో దాడి చేసి అతికిరాతకంగా తల నరికి శరీరం నుంచి వేరుచేశాడు. తలను తీసుకుని వీధుల్లోకి వచ్చాడు.అనంతరం బురమేరులో పడవేశాడు.
బుడమేరులో తల కోసం వెతుకుతున్న పోలీసులు
ఇక భార్యను నరికి తలకు కిరాతకంగా వేరు చేసిన ప్రదీప్ తలను బుడమేరులో పడేవేసిన అనంతరం నేరుగా సత్యనారయణపురం పోలీసుస్టేషన్కు వెళ్లి లోంగిపోయాడు. ఇద్దరి మధ్య వివాదాల వల్లే భార్యను చంపానని నేరాన్ని అంగీకరించాడు. దీంతో కేసును నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బుడమేరులో హత్యకు గురైన మహిళ తల కోసం వెతుకుతున్నారు పోలీసులు. మరోవైపు ఇద్దరి మధ్య మనస్ఫర్ధలే కారణమా లేక ఇంకా ఇతర కారణాలు ఎవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.