వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమానంతో ప్రియురాలికి వేధింపులు,ప్రియుడిని ఇలా ...

కడప జిల్లాలో ప్రియురాలే ప్రియుడిని హత్య చేసింది.అనుమానం పెంచుకొని ప్రియుడు వేధిస్తుండడంతో తండ్రితో కలిసి ఆమె ప్రియుడిని హత్య చేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప :కడప జిల్లా గొల్లపల్లెకు చెందిన శేఖర్ అనే ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. గోనేసంచిలో శేఖర్ మృతదేహం పోలీసులకు దొరికింది.నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ప్రియురాలే నిందితురాలని తేల్చింది.

కడప జిల్లా గొల్లపల్లెకు చెందిన శేఖర్ కు భార్య , ముగ్గురు పిల్లలున్నారు. శేఖర్ ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు.శేఖర్ .శేఖర్ కు బండివారిపల్లెలో నివాసం ఉంటున్న నీలి భారతితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.

భారతికి కూడ వివాహమైంది. ఆమెకు నంద్యాలకు చెందిన రవికుమార్ తో వివాహమైంది.అయితే రవికుమార్ తో భారతికి విబేధాలు ఏర్పడ్గాయి. ఈ విబేధాల కారణంగా ఆమె భర్తతో దూరంగా తండ్రివద్దే ఉంటోంది.

a man murdered for harassing lover

అయితే శేఖర్ భారతితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.కొంత కాలం వారి మద్య సంబందం కొనసాగింది.కాని, శేఖర్ భారతిపై అనుమానం పెంచుకొన్నాడు.దీంతో ఆమెను వేధించడం ప్రారంభించాడు.

ఈ వేదింపులు భరించలేక భారతి శేఖర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు శేఖర్ కు శిక్ష కూడ పడింది.జైలు నుండి వచ్చిన శేఖర్ తిరిగి భారతిని వేధించడం ప్రారంభించాడు.

అయితే శేఖర్ ను హత్య చేయాలని భారతి పథకం వేశారు. ఇంటికి వచ్చిన శేఖర్ ను పథకం ప్రకారంగా రోకలితో కొట్టి చంపేశారు.అనంతరం గోనేసంచిలో శవాన్ని కుక్కి మామిళ్లపల్లె వెళ్ళే రహదారిలో కల్వర్టులో పడేసి యాసిడ్ పోయడంతో పాటు పెట్రోల్ పోసి అంటించారు.

అయితే అది పూర్తిగా కాలిపోలేదు. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేసి పోలీసులు భారతిని, ఆమె తండ్రిని అరెస్టు చేశారు.

English summary
A man murdered for harassing lover in kadapa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X