గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగళగిరిలో దారుణం: మైనర్ బాలిక కిడ్నాప్, గ్యాంగ్‌రేప్

జిల్లాలోని మంగళగిరి మండలం నవులూరు ఉడాకాలనీ లో మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం నవులూరు ఉడాకాలనీ లో మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేశారు. స్థానిక అమరావతి టౌన్ షిప్‌లో నివాసం ఉంటున్న ఓ మైనర్ సుమారు 15 ఏళ్ళు బాలిక ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. గురువారం సాయంత్రం బాలిక తన యజమాని ఇంట్లో పని చేసేందుకు వెళుతోంది.

ఈ విషయాన్ని రెక్కీ నిర్వహించిన సుమారు 15 -17 మధ్య వయస్సు కలిగిన ముగ్గురు మైనర్ బాలురు.. పని ముగించుకున్న బాలిక ఇంటికి బయలుదేరింది. బయటకు వచ్చిన బాలికను ఓ బాలుడు పలకరించే ప్రయత్నం చేయగా మిగిలిన ఇద్దరు ఆ బాలికను ఆటో లో ఎక్కించి స్థానిక అమరావతి టౌన్ షిప్‌లో పొడల్లోకి లాక్కు పోయి అత్యాచారం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

A minor girl gangraped in Mangalagiri

అయితే విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు స్థానిక పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బాలిక చెప్పిన ముగ్గురు బాలురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

రెచ్చిపోతున్న గ్రామ సింహాలు: నిన్న 5ఏళ్ల బాలుడు, నేడు 12 గొర్రెలు మృతి

గుంటూరు‌లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. నిన్న మధ్యాహ్నం అనంతరం వీధి కుక్కల దాడిలో 5 ఏళ్ల బాలుడు మృతి ఘటన మరిచే లోగానే దాచేపల్లి మండలంలోని సారంగపల్లి అగ్రహారంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఓ గొర్రెల కాపరి గొర్రెల మండి పై కుక్కలు దాడి చేశాయి.

రాత్రి పొలం నుండి ఇంటికి వచ్చిన గొర్రెలను గొర్రెల కాపరి వాటిని దొడ్డిలో కి తోలి గేట్లు వేసాడు. కాగా, గొర్రెల షెడ్డుకి ఓ ప్రక్క కొంత ఖాళీ ప్రాంతం ఉంది. ఇది గమనించని గొర్రెల కాపరి గొఱ్ఱెలన్నింటిని దొడ్డి లో బంధించారు. అటుగా వచ్చిన కుక్కలు.. రెచ్చిపోయి గొర్రెల మండిపై దాడి చేశాయి. ఈ దాడి లో మొత్తం 12 గొఱ్ఱెలు మృతి చెందగా,7 గొర్రెలు తీవ్రగాయాల పాలయ్యాయి.

గొర్రెల యజమాని ఉదయం మండి లోకి వెళ్లి చూసుకోగా గొర్రెలు బెదిరిపోయి కనబడ్డాయి. మరికొద్ది లోపలికి వెళ్ళాక 12 గొర్రెలు మృతి చెంది ఉన్నాయి. మరికొన్ని గొర్రెలు తీవ్రగాయాలతో ఉన్నాయి. దీంతో గొర్రెల యజమాని 7 గొర్రెలను స్థానిక పశువుల ఆసుపత్రికి తరలించగా అక్కడ డాక్టర్లు వాటికి వైద్యం అందిస్తున్నారు. అయినప్పటికీ గొర్రెల పరిస్థితి విషమంగా ఉందని యజమాని బోరున విలపిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే గుంటూరులో వీధి కుక్కలు రెచ్చిపోయి మనుషుల మీద, పశువుల మీద దాడి విషయం అక్కడ ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది. అధికారులు, పాలకులు స్పందించి వీధి కుక్కల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

English summary
A minor girl allegedly gangraped in Mangalagiri and three accused arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X