జరిగేనా?: టీడీపీ మహానాడుపై హైకోర్టులో పిల్
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.
హైదరాబాద్: ఆంధ్రా విశ్వవిద్యాలయంలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. రీసెర్చ్ స్కారు ఒకరు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం మధ్యాహ్నం 2.30గంటలకు విచారణ చేపట్టనుంది.
కాగా, ఏయూలో మహానాడు నిర్వహణపై ఇప్పటికే వివాదాలు తలెల్తాయి. విద్యాసంస్థల్లో రాజకీయ సభలు నిర్వహించొద్దని గతంలో ఆదేశాలున్నా.. ఇప్పుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏయూలో మహానాడు ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఏయూలో మహానాడు నిర్వహణపై విద్యార్థి సంఘాలు కూడా నిరసన గళం వినిపిస్తున్నాయి. కాగా, శనివారం నుంచి మూడు రోజులపాటు తెలుగుదేశం మహానాడును ఏయూలో నిర్వహించాలని టీడీపీ తలపెట్టిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఏయూ దొయ్యాల కొంప అంటూ టీడీపీ ఎమ్మెల్సీ, గీతం విశ్వవిద్యాలయం అధినేత ఎంవీవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.