హైదరాబాద్ విమానానికి తప్పిన ముప్పు: రేణిగుంటలో అత్యవసర ల్యాండింగ్!
తిరుపతి: స్పైస్జెట్ విమానానికి పెను ముప్పు తప్పింది. పైలెట్ అప్రమత్తంగా ఉండటం వల్ల విమానం సురక్షితంగా నేలకు దిగింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న వెంటనే పైలెట్ విమానం ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే- వెనక్కి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
స్పైస్జెట్ విమానం ఈ తెల్లవారు జామున రేణిగుంట నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. ఆ సమయంలో విమానంలో 40 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానం టేకాఫ్ తీసుకున్న రెండు నిమిషాల వ్యవధిలోనే ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని గుర్తించారు పైలెట్. వెంటనే- ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విమానాన్ని వెనక్కి మళ్లించారు. అత్యవసర ల్యాండ్ చేశారు.
Andhra Pradesh: A SpiceJet, Hyderabad to Renigunta flight was halted at the Renigunta International Airport due to a technical snag. Pilot identified the snag after take-off, following which the aircraft was landed safely. 40 passengers were on-board at the time of incident. pic.twitter.com/YzXSiHGrD5
— ANI (@ANI) July 17, 2019
సుమారు రెండు గంటల నుంచి ఈ విమానం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలోనే నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సాంకేతిక సిబ్బంది విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇంజిన్ లోపాన్ని సరిచేస్తున్నారు. విమానం టేకాఫ్ తీసుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులను రేణిగుంటలో ఉన్న హోటల్కు తరలించారు.