పెళ్ళిచేసుకోకపోతే గ్యాంగ్ రేప్ చేస్తాం, గిరిజన యువతిని వారంపాటు గృహనిర్భంధం
తనను పెళ్ళిచేసుకోవాలంటూ ఓ గిరిజన యువకుడు ఓ విద్యార్థినిని వారంరోజులపాటు నిర్భంధించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
కాకినాడ: తనను పెళ్ళిచేసుకోవాలంటూ ఓ గిరిజన యువకుడు ఓ విద్యార్థినిని వారంరోజులపాటు నిర్భంధించాడు. తూర్పుగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
చింతలపూడికి చెందిన గిరిజన యువతి కాకినాడలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో నర్సింగ్ కోర్స్ చదువుతోంది. ఈ నెల 20వ, తేదిన వలస గ్రామంలో జరిగిన పెళ్ళికి ఆమె హాజరైంది. అయితే అక్కడికొచ్చిన చింతలపూడి సర్పంచ్ ఆమెను బలవంతంగా అటవీ ప్రాంతంలోని ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్ళాడు.
ఓ గిరిజన యువకుడిని చూపి అతడిని పెళ్ళిచేసుకోవాలని బెదిరించాడు. లేకపోతే సామూహికంగా అత్యాచారం చేస్తామని బెదిరించాడు. వారం రోజుల పాటు ఆమెను గృహనిర్భంధంలోనే ఉంచారు.
అయితే ఏం చేయాలో దిక్కుతోచక ఆ యువతి పెళ్ళికి ఒప్పుకొంది. అయితే తన చదువు పూర్తయ్యాకే పెళ్ళిచేసుకొంటానని ఆమె నిందితులను నమ్మించింది. దీంతో ఆమెను నిందితులు వదిలేశారు. అక్కడి నుండి ఆమె నేరుగా ఏఏస్సీ వద్దకు వెళ్ళి ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసుకొన్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.