పబ్ డాన్సర్ వ్యభిచారం చేయాల్సిందే...! తోటీ మహిళా డాన్సర్లే దాడి..
బతుకుదెరువు కోసం పబ్ డాన్సర్ అయిన పాపానికి వ్వభిచారం చేయాలని పట్టుపట్టారు పబ్ నిర్వహాకులు...డాన్సర్ అంగీకంరించడంతో ఆమేపై ఒత్తిడి తెచ్చారు. చివరికి చేసేదిమిలేక తోటి డాన్సర్లే ఆమే దాడికి దిగారు. పబ్లో వందలాదీ మంది చూస్తుండగానే ఆమేపై బీరు సీసాలతో దాడి చేసి ఒళ్లంత గాయపర్చారు. .అయితే దాడి చేసిన తోటీ డాన్సర్లలో మహిళ డాన్సర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం...
సినిమా చాన్స్ల కోసం హైదరాబాద్కు వచ్చిన హరిణి,
గుంటూరు జిల్లా సంగడికుంటకు చెందిన జీ.హరిణి గత కొంతకాలంగా హైదారాబాద్లో ఉంటుంది. సినిమాల్లో నటించేందుకు నగరానికి చేరుకున్న ఆమే సరైన అవకాశాలు రాలేదు. దీనికి తోడు తండ్రి ఆరోగ్యం క్షిణించడం, కుటుంభం ఆర్ధిక కష్టాల్లో ఉండడంతో చేసేదిలేక తనకు తెలిసిన వారి ద్వార హైదరాబాద్ బేగంపేటలోని లిస్పన్ క్లబ్లో గత అయిదు నెలల క్రితం క్లబ్ డాన్సర్గా చేస్తుంది.
బతుకుదెరువు కోసం పబ్లో డాన్సర్గా
అయిదు పబ్లో జాయిన్ అయిన కొద్ది రోజుల వరకు ఎలాంటీ ఒత్తిడీ చేయని నిర్వహాకులు కొద్ది రోజుల తర్వాత వ్యభిచార రోంపిలోకి దింపాలని ప్లాన్ చేశారు. దీంతో క్లబ్లో డాన్స్ చేస్తున్న మరో మధ్యవర్తి అయిన సయ్యద్ హుస్సెన్తో హరిణిపై ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఒక్క రాత్రీ గడిపితే 10 వేలు ఇస్తారని ఆమే చెప్పారు.అయితే ఆమే తాను పోట్ట కూటి కోసమే వచ్చానని, అలాంటీ ఆసాంఘీక చర్యలు తాను పాల్పడనని స్పష్టం చేసింది.
వ్యభిచారం చేయాలంటూ డాన్సర్పై నిర్వాహాకుల ఒత్తిడి
ఈనేపథ్యంలోనే శుక్రవారం రాత్రీ సైతం ఓ కస్టమర్ వద్దకు వెళ్లాలని ఒత్తిడే తేవడంతో హరిణి నిరాకరించింది. దీంతో ఆమే కక్ష పెంచుకున్న యాజమాన్యం తోటి డాన్సర్లతో దాడి చేయించారు. కాగా దాడిలో తోటి మహిళా డాన్నర్లు ఆమేపై రితిక, స్వీటి,మధు, విజయారెడ్డి అనే మహిళ డాన్సర్లతో పాటు సయ్యద్ హుస్సెన్లు ఆమే పై అర్ధరాత్రీ పబ్లోనే దాడి చేశారు. బీరు ససాలను పగులగొట్టి ఆమే ఒంటిపై గాయాలు చేశారు. అందరు చూస్తూండగా బట్టలుడదీసీ కోట్టారు.అయితే దాడి చేస్తున్న సంధర్భంలోనే బయటికి వచ్చి పోలీసులకు సమాచారం అందివ్వడంతో మరింత రెచ్చిపోయిన డాన్సర్లు సెల్ఫోను లాక్కుని పగుల గొట్టారు.
పిర్యాధు చేసినా పట్టించకోని పోలీసులు
దాడి అనంతరం హరిణి పోలీసులకు పిర్యాధు చేసిన పట్టించుకోలేదని పబ్కు వచ్చిన పోలీసులు మాత్రం క్లబ్ నిర్వాహాకులకు వత్తసు పలికారని ఆమే వాపోయింది. అయితే విషయమై గత పదిరోజుల క్రితమే పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని, పైగా ఆమేను అవమానిస్తూ మాట్లాడరని హరిణి ఏడుస్తూ మీడియాకు చెప్పింది.మిడియాకు వివరించింది.అయితే శనివారం ఆమే పిర్యాధును స్వికరించిన పోలీసులు అధికారులు తగిన చర్యలు చేపడతామని తెలిపారు.