దారుణం: అక్క ప్రేమించలేదని తమ్ముడిని చంపేశాడు
గుంటూరు: జిల్లాలోని రేపల్లె మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను అంగీకరించడం లేదని కోపంతో.. ఓ దుర్మార్గుడు ఆమె తమ్ముడిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్మాత అతడు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రేపల్లె మండలం చోడాయపాలేనికి చెందిన సముద్రాల రాజు దంపతులకు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సాల్మన్బాబుకు ఆరేళ్లు. కాగా, ఇంటి ఎదురుగా ఉంటున్న మండే రత్నరాజు... రాజు కుమార్తెపై కన్నేశాడు.
ఈ నేపథ్యంలో ఆమెను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. ఆమె ఈ విషయం ఇంట్లో చెప్పడంతో.. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈవిషయం తెలుసుకొన్న రత్నరాజు వ్యక్తిగతంగా పగ పెంచుకొన్నాడు.
మంగళవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకొంటున్న సాల్మన్రాజును రెండ్రోజుల క్రితం అపహరించి.. దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత అరెస్టు భయంతో బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. కాగా, ఊరి శివార్లలోని మోర్తోట కృష్ణానది ఒడ్డున సాల్మన్బాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.
యువకుడి దారుణ హత్య
ఓ యువకుడిని అతని స్నేహితులే దారుణంగా చంపారు. గుంటూరు జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. దాచేపల్లికి చెందిన అన్నం విజయ్ కుమార్, అతని స్నేహితులు కలిసి బుధవారం రాత్రి స్థానిక బార్కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం నలుగురు కలిసి బయటికి వెళ్లారు.
కాగా, గురువారం ఉదయం అజయ్ మృతదేహం మాచర్ల మండలం కంభంపాడు వద్ద ఓ పాత రైత్ మిల్లులో చెట్లపొదల మాటున స్థానికులు గుర్తించారు. అజయ్ తోపాటు వెళ్లిన స్నేహితులే ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.