విద్యామంత్రిగా కార్పోరేట్ కాలేజీలపై గంటా
అమరావతి: కార్పోరేట్ కాలేజీల్లో మరణాలపై మంత్రి గంటా సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశం మేరకు రాష్ట్రంలో కార్పోరేట్ కాలేజీలపై కొరడా ఝళిపిస్తామని హెచ్చరించారు.
Recommended Video
కార్పోరేట్ కాలేజీల్లో వరుసగా విద్యార్థులు మరణించడంతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లో 25 ఏళ్లుగా కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి కీలకంగా పని చేస్తున్నారు. 2009 వరకు టీడీపీలో ఉన్న గంటా శ్రీనివాసరావు. ఎన్నికలకు ముందే ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందారు.. తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఏపీ మంత్రిగా పని చేశారు.
2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిపోయి మళ్లీ విజయం సాధించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలంగా మారారు.కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాలంలో కూడ గంటా శ్రీనివాసరావు మంత్రిగా పనిచేశారు.