వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ .. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించింది. అయినప్పటికీ విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధప్రదేశ్ లో రేపు పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలిపింది. ముఖ్యంగా 9 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తాము బంద్ చేపట్టనున్నట్లు ఏబీవీపీ నేతలు చెప్తున్నారు .

కేటీఆర్ , హరీష్ ల సరదా సంభాషణ .. బావా ..మళ్ళీ కుదరదేమో మన పాత ఛాంబర్లు చూసుకుందాం రాకేటీఆర్ , హరీష్ ల సరదా సంభాషణ .. బావా ..మళ్ళీ కుదరదేమో మన పాత ఛాంబర్లు చూసుకుందాం రా

Recommended Video

పాఠశాల భవనాలకు గ్రామ యువత స్వచ్ఛంద గా సున్నం వేస్తున్న యువత
రేపు ఏపీలో స్కూళ్ళు బంద్ .. విద్యా సమస్యల పరిష్కారం కోసం బంద్ కు పిలుపు

రేపు ఏపీలో స్కూళ్ళు బంద్ .. విద్యా సమస్యల పరిష్కారం కోసం బంద్ కు పిలుపు

కార్పోరేట్ ప్రైవేట్ స్కూల్స్ లో దోపిడీకి చెక్ పెట్టాలని వారు కోరారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరిచే దిశగా ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను నిరుపేదలకు కేటాయించేలా చూడాలన్న డిమాండ్ ను వారు ప్రభుత్వం ముందు ఉంచారు . విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలనీ, ఏపీలో ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని నిర్వహింఛి ఆ పనిని త్వరిత గతిన పూర్తి చెయ్యాలని కోరారు .

కార్పోరేట్ విద్యా మాఫియాపై ఉక్కు పాదం మోపండి అంటున్న ఏబీవీపీ

కార్పోరేట్ విద్యా మాఫియాపై ఉక్కు పాదం మోపండి అంటున్న ఏబీవీపీ

ఇక అంతే కాదు విద్యార్థులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. అమ్మ ఒడి పథకాన్ని ఏబీవీపీ స్వాగతిస్తోందని అయితే కార్పొరేట్‌ విద్య మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలనే డిమాండ్ చేస్తున్నారు . రాష్ట్రంలో దోపిడీ కొనసాగుతుందని బ్రాండ్‌ పేరుతో కేజీ నుంచి పీజీ వరకు జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. పేరెంట్స్‌ కమిటీలను ఏర్పాటు చేసి, ఫీజు రెగ్యులేటరీ కమిషన్‌ను నియమించాలని కోరారు. ఈ డిమాండ్లతో బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ తెలిపింది.

విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించిన వైసీపీ సర్కార్

విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించిన వైసీపీ సర్కార్

ఇప్పటికే వైసీపీ సర్కార్ అనుమతులు లేని స్కూల్స్ ను సీజ్ చెయ్యాలని సూచించింది. అంతే కాకుండా నిబంధనలను పాటించని స్కూల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అందులో భాగంగా నారాయణ, చైతన్య వంటి విద్యా సంస్థలపైనే చర్యలు తీసుకుంది. ఇక నిబంధనలు పాటించకున్నా, అక్రమాలకూ పాల్పడినా ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది జగన్ సర్కార్ . విద్యా వ్యవస్థ ప్రక్షాళన చెయ్యాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రైవేట్ స్కూల్స్ లో దోపిడీకి చెక్ పెట్టటానికి ఫి రెగ్యులేటరీ కమీషన్ ను వెయ్యాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా అధికారులు కూడా రంగంలోకి దిగారు.

English summary
On the one hand, the state government has set the stage for the purging of the education system in AP. However, the All India Bharatiya Vidyarthi Parishad has said that tomorrow's school bandh will be held in Andhra Pradesh to address educational issues. ABVP leaders say they will take up bandh in particular to address 9 demands. They demanded a check for exploitation in corporate private schools.The AP government has demanded immediate action to strengthen govt schools. They have put forward the demand to ensure that 25% of the seats in the private schools are allocated to the poor.They demanded the implementation of the Right to Education Act, replacing the vacant DEEO, Deputy DEEO and MEE vacancies in the AP. The vacant teacher posts in the state are being held by the Mega DSC and they want to complete the work quickly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X