ఆగి ఉన్న లారీనీ ఢికొని ఇద్దరు మృతి, భీమిలి వద్ద అదుపుతప్పిన బొలెరో
చిత్తూరు శివారు ముత్తిరేవులు రైల్వే గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీనీ వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
చిత్తూరు: చిత్తూరు శివారు ముత్తిరేవులు రైల్వే గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీనీ వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విశాఖలో అదుపుతప్పిన బొలెరో
విశాఖపట్నం భీమిలి తాహశీల్దార్ కార్యాలయం సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రక్క ప్రయాణీకులపై దూసుకుపోయింది. మరోఆటో దిగుతున్న ప్రయాణీకులపైకి అదుపు తప్పి బొలెరో దూసుకు వచ్చింది.
అప్పుడే ఆటో దిగి రోడ్డుప్రక్కన నిలుచుని ఉన్న ఇద్దరు ప్రయాణీకులపై వేగంగా దూసుకువచింది .ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, వారి తో పాటు ప్రక్కనే నిలుచున్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బొలెరో బ్రేక్ ఫెయిల్ అవడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. జరిగిన ప్రమాదం పై భీమిలీ పోలీసులు కేసు నమోదు చేశారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.