కారు పార్క్ చేస్తుండగా సినీ నటి శ్రీలక్ష్మి చైన్ లాక్కెళ్లారు
డబ్బుల కోసం తల్లిని చంపేశాడు
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖర్చులకు డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చాడో తనయుడు. కడియం మండలంలోని కడియపులంకలో అడిగిన డబ్బులివ్వలేని కన్నతల్లిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు.
విషజ్వరాలతో ఐదుగురు మృతి
ఖమ్మం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మంగళవారం ఒకేరోజున అయిదుగురు మృత్యువాత పడ్డారు. తిరుమలాయపాలెం మండలం పాపాయిగూడేనికి చెందిన రేపాకుల రంజిత్ (6), కొత్తగూడెం మండలం రాఘవాపురానికి చెందిన సరస్వతి(18) విషజ్వరంతో మంగళవారం మృతిచెందింది. చింతకానికిచెందిన ధరావత్ మంజుల(45), కుక్కునూరుమండలం ఉప్పేరుకు చెందిన వెంకటయ్య(45) బూర్గంపాడు మండలం అంజనాపురానికి చెందిన సక్కుబాయి(35) డెంగ్యూతో మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
విశాఖలోని మాధవధార వద్ద జాతీయ రహదారి పైన రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం - లారీ ఢీకొనగా ద్విచక్ర వాహం పైన ప్రయాణిస్తున్న దంపతులు ఇద్దరూ మృతి చెందారని తెలుస్తోంది.