గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో మరో దారుణం: బాలికపై తాపీకూలి అత్యాచారం..

|
Google Oneindia TeluguNews

గుంటూరు: దాచేపల్లి అత్యాచార ఘటనతో దావానంలా ఎగసిపడ్డ నిరసనలు ఇంకా చల్లారనేలేదు, ఇంతలోనే జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. తాజా ఘటనలో ఓ తాపీకూలీ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరులో ఈ ఘటన జరిగింది. నిందితుడిని నాగూర్ మీరాగా గుర్తించారు. ఘటనపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. 'ఆడబిడ్డకు అండగా కదులుదాం' అంటూ ప్రభుత్వం ఓ కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రోజే ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.

after dachepalli another rape incident in guntur district

ఆడబిడ్డకు అండగా కదులుదాం:

బాలికలు, మహిళలపై లైంగిక దాడులను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం 'ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం' ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి ర్యాలీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్‌ సత్యార్థి తన మద్దతు తెలిపారు. ఈమేరకు చంద్రబాబుకు ఆయన ఫోన్‌ చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బాలల హక్కుల కార్యకర్తలు పాల్గొంటారని, తాను కూడా హాజరవుతానని చంద్రబాబుతో సత్యార్థి కైలాష్‌ చెప్పినట్టు సమాచారం.

English summary
After Dachepalli rape incident, another rape incident came into light in Guntur district. A girl was raped by a Man in Modukur
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X